తెలుగులో పెద్దలకు సంబంధించిన సాహిత్యం 11వ శతాబ్దం నుంచి రకరకాల ప్రక్రియల రూపంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పిల్లలకు ప్రౌఢ సాహిత్య తత్వానికి ప్రయోజనానికి భిన్నంగా ప్రత్యేక సాహిత్యం ఉందన్న విషయం మాత్రం కొంత మందికే తెలుసు.అలాంటి సమయంలో తెలుగు బాలసాహిత్యాన్ని మొట్టమొదట పరిశోధనాంశంగా తీసుకొని దాని ఉనికిని తెలియజెప్పిన మొదటి వ్యక్తి ఆచార్య దేవకి. అప్పటికి ఆ సాహిత్యం గురించి వచ్చిన వ్యాసాలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మొదటి పరిశోధన కాబట్టి బాల సాహిత్యాన్ని నిర్వచించి పుట్టుక పరిణామాలను పిల్లల పత్రికలను ఆ సాహిత్యానికి తోడ్పడిన వివిధ సంస్థల వివరాలను శాస్త్రీయంగా పొందుపరచడానికి ఎంత శ్రమపడి ఉంటారో ఊహించలేము. ఆ తర్వాత ఆ మార్గంలో నడిచి బాల సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో చాలా మందే పరిశోధన చేశారు.తన పరిశోధన ఎలాసాగిందో ఆసక్తి దాయకంగా కథల్లాగా ఎలా చెప్పుకొచ్చారో చూడాలంటే ఈ గ్రంథాన్ని చదవాల్సిందే.